కాలిఫోర్నియాలో శాస్త్రవేత్తలు వరదల్లో 17 రోజులు తడిసినా పాడవ్వని వరిని కనిపెట్టారు. దీని వలన ప్రపంచములో 3 కోట్ల మందిని ఆకలి బాధల నుంచి కాపాడవచ్చు. ఎలా అంటారా? వరదల్లో తడవటం వల్లన ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల వరి నేలపాలు అవుతున్నది. అది కాపాడుకోగలిగితే?
నా గురించి చెప్పుకోటానికి పెద్దగా లేదు. విజయవాడ లబ్బీపేటలో Greeen Lands restaurant ను చాల సంవత్సరాలు నడిపి అటు పిమ్మట Americaలో ఒక 5 ఏళ్ళు గడిపినాక అక్కడ జీవన విధానంకన్నను విజయవాడ ఎన్నో రెట్లు నయం అనిపించి అక్కడ యిమడలేక 2001 లో తిరిగి వచ్చాను.
విజయవాడ దగ్గిరలోని వేల్పూరు (కంకిపాడు మండలం) లో ఒక 20 ఎకరములలో వ్యవసాయం మొదలు పెట్టాను. సేంద్రీయ పద్ధతిలో సాగు చెయ్యాలని అన్ని వివరములు సేకరించి మొదలు పెట్టాను. ఇందులో కె.వి.రావు (కొల్లూరు) గారి సలహాలు సహకారం ఎంతైనా ఉంది. అందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞుడిని.
మా నాన్నగారు కాట్రగడ్డ భవాని శంకర్ గారు నాకు ప్రేరణ. వారు ఇంట్లో కాని, పొలంలో కాని chemicals వాడటానికి అసలు ఒప్పుకునేవారు కాదు. పొలం కౌలుకిచ్చినా కూడ వాళ్ళు chemicals వాడకూడదని గట్టిగా చెప్పేవారు.
మా యింట్లో గేదెలు, కోళ్ళు, పావురాలు, కుక్కలు వుండేవి. అన్ని Organicగా పెరిగినవే. Organic పాలు, కూరగాయలు తిని పెరిగాము అందరము (మేము 8 మంది పిల్లలం).
ఆ ప్రేరణతోనే నేను కూడ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం మొదలు పెట్టాను.